గుంటూరు జిల్లాలో పేకాట శిబిరం పై చేసిన దాడిలో ఎస్సై పట్టుబడటం సంచలనంగా మారింది. జిల్లాలోని నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు నేడు దాడి చేసారు. ఈ దాడిలో ఒక ఎస్‌ఐ తో పాటుగా ఒక కీలక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా అధికారులకు చిక్కారు. 

 

అయితే ఓ ప్రజా ప్రతినిధి సోదరుడి కనుసన్నలలో పేకాట శిబిరం నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకు ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తుంది. ఇక దొరికిన ఎస్సై కి సంబంధించిన విషయాన్ని కూడా బయటపెట్టలేదు. మరి ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: