ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచం మొత్తానికి కూడా చుక్కలు చూపిస్తుంది. దానితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయినా సరే చాలా మంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కరోనా ఉన్న వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా సరే అధికారులు చేసిన ఒక తప్పు గుజరాత్ లో సంచలనంగా మారింది. పొరపాటున కారోనా నెగిటివ్ ఉన్న వ్యక్తికి బదులు పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జ్ చేసారు. 

 

ఇద్దరిది ఒకే పేరు ఉండటం తో అధికారులు కాస్త పొరపాటు పడి ఇలా చేసారు. వెంటనే విషయం తెలుసుకుని అతన్ని తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి వర్గాలు క్షమాపణ చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: