భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వేల కేసులు నమోదు అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 6,629 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 142 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ శాతం 41.28 గా ఉంది. 

 

ఇక కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఒక లక్షా 31 వేల 868 గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 73,560 గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 54,441 గా ఉంది. మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 3867 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: