లాక్ డౌన్ లో ప్రజలు పడుతున్న ఆర్ధిక కష్టాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తినడానికి తిండి లేక ఎందరో  ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళను ఆదుకునే వాళ్ళు కూడా దాదాపుగా లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఎంత సాయం చేస్తున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదనే చెప్పాలి. 

 

తాజాగా హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పరిణామం చోటు చేసుకుంది. ఆర్ధిక కష్టాలను తట్టుకోలేక ఇద్దరు దంపతులు తమకు పుట్టిన చిన్నారిని అమ్మకానినికి పెట్టారు. అక్కడ రోడ్డు మీద ఉన్న స్థానికులు ఈ పరిణామం చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: