టీటీడీ ఆస్తుల జోలికి వస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ హెచ్చరించారు. కాసేపటి క్రితం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆస్తులను అమ్మాలి అనుకుంటున్నా నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరర్ధక ఆస్తులకు రక్షణ ఉండదు అని తమకు తెలుసు జీవో నెంబర్ 39 పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. 

 

దేవాలయాల భూముల కోసం గతంలో ఎన్నో ధర్నాలు చేసామని ఆయన గుర్తు చేసారు. ఎందరో దాతలు భూములను ఇచ్చారని వారి మనోభావాలకు ఆటంకం కలిగే విధంగా టీటీడీ వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా తాను ఎల్లుండు ధర్నా చేస్తా అని కన్నా ప్రకటించారు. ఆస్తులను కాపాడుకుంటాం అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: