విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా సోకడం ఏమో గాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రత్యేక విమానాల ద్వారా విదేశాల్లో ఉండే వాళ్ళను మన దేశానికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వారికి కరోనా సోకడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో అక్రమంగా ఉండటానికి ప్రయత్నించారు అనే ఆరోపణలతో 160 మందిని తిప్పి పంపించారు. 

 

ఇక 160 మందిలో 72 మంది హ‌ర్యానా వాసులు ఉండగా వారికి కరోనా పరిక్షలు చేయగా 22 మందికి కరోనా ఉందనే విషయం బయటపడింది. పంచ‌కుల‌లోని ప్ర‌త్యేక‌ క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. ఇక వీరితో పాటు విమాన ప్రయాణం చేసిన అందరికి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు వైద్యులు. వీరి కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: