ప్రజలు కష్టాల్లో ఉంటే సంబరాలు జరపడం శాడిజం కాదా అంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ పాలనకు వంద మార్కులు అనడంపై... హింసా, విధ్వంసాలకు 100% మార్కులా? అంటూ ఆయన ఎద్దేవా చేసారు. జనం ఉసురు తీసినందుకా 100% సంతృప్తి? అంటూ యనమల ప్రశ్నించారు. నవరత్నాలు నవ మోసాలుగా చేసినందుకా 100 మార్కులు? అని నిలదీశారు యనమల. 

 

ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారాయన. జగన్‌ ఏడాది పాలన వైకాపా నాయకులకే 100శాతం సంతృప్తి తప్ప... ఏ వర్గానికి ఒరగబెట్టింది లేదని, ఉన్న స్కీములు రద్దు చేసి పేర్లు మార్చారే తప్ప కొత్తగా ఇచ్చింది శూన్యమన్నారు యనమల. తప్పుడు కేసులతో అన్ని వర్గాల ప్రజలను క్షోభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: