ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ కి కాస్త ఇబ్బంది గానే ఉంటాయి. ప్రధానంగా టీడీపీ సీనియర్ నేతలను అధినేత చంద్రబాబుని, టీడీపీకి అనుకూలంగా ఉంది అనుకునే మీడియాపై ఆయన చేసే విమర్శలు అన్నీ ఇన్ని కావు. చివరికి టీడీపీ నేతలు కూడా ఆయన ట్విట్టర్ ని ఫాలో అయ్యే పరిస్థితి ఉందని కొందరు వ్యాఖ్యానిస్తారు. 

 

తాజాగా మరో ట్వీట్ చేసారు విజయసాయి... చిత్తుగా ఓడాక ఫ్రస్ట్రేషన్ పెరిగి మెంటల్ కండిషన్ సీరియస్ అయి ఉండొచ్చుకాని రెండు మూడేళ్ల క్రితమే పిచ్చి ముదిరిందని చంద్రబాబు ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటి మాటలు అలాగే ఉన్నాయన్నారు. బావుల అనుసంధానం చేస్తానని అంటే, ఎల్లో మీడియా ‘విజనరీ’ వాక్కులకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి అచ్చేసిందని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: