హైదరాబాద్ ఉస్మానియా యునివర్సిటి లో ఉద్రిక్త వాతావరణం చోటు  చేసుకుంది. ఓయూ భూములను పరిశీలించడానికి గానూ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ సీనియర్ నేత వీహెచ్ వెళ్ళారు. భూములను కబ్జా చేస్తున్నారని తాము పరిశీలించడానికి వచ్చామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. 

 

అయితే వారిని పోలీసులు అడ్డుకోవడం తో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూములను కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నేతలు నిలదీశారు. ఇక అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ నేతలకు మద్దతుగా విద్యార్ధులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: