ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా మాస్క్ అనేది చాలా అవసరం. అందుకే ఎవరికి వారుగా మాస్క్ ల మీద ప్రచార౦ కల్పిస్తున్నారు. మన దేశంలో కూడా ప్రధాని నుంచి గ్రామ సర్పంచ్ వరకు మాస్క్ అనేది చాలా అవసరం అని చెప్తున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున మాస్క్ లను పంపిణి చేస్తున్నారు. 

 

తాజాగా కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే పెళ్లి చేసుకున్న వాళ్లకు మాస్క్ లను పంపిణి చేసిన సంగతి తెలిసిందే. బిజెపి ఎమ్మెల్యే ఎంపి రేణుకాచార్య దావనగెరెలోని హోన్నాలి ప్రాంతంలో కొత్తగా పెళ్లి చేసుకున్న మూడు జంటలకు మాస్క్ లను పంపిణీ చేశారు. కాగా అక్కడ ఆదివారం వివాహాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: