కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఎవరికి వారుగా ప్రభుత్వాలకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కష్ట సమయంలో ఎవరికి వారుగా ముందుకు వచ్చి అండగా నిలుస్తున్నారు. తమకు చేతనైన సాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు చేస్తున్న సంగతి తెలిసి౦దే. తాజాగా మరొకరు సాయం చేసారు. 

 

ఆయన ఎవరో కాదు... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తన జీతం నుండి రూ .50 వేలు ప్రతి నెలా ఏడాది పాటు కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి గానూ ఏర్పాటు చేసిన పిఎమ్ కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాసేపటి క్రితం మీడియాకు ఈ విషయాన్ని ప్రకటించారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: