వరంగల్ జిల్లా గీసుకొండ మండల౦ గొర్రెకుంట గ్రామంలో ఒక బావిలో మృతదేహాలు లభ్యం కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. 9 మరణాలు ఏ విధంగా జరిగాయి అనే దాని మీద ఇప్పుడు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఇక వారి మీద విష ప్రయోగం జరిగిందా లేదా అనే దాని మీద అయితే ఇప్పటి వరకు అంచనాకు రాలేదు. 

 

అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వారిని చనిపోయే ముందు కొట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. వారి శరీరంపై గాయాలు ఉన్నాయని వాటిని చూస్తే కచ్చితంగా వారి మీద దాడి జరిగింది అనే విషయం అర్ధమవుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. కాగా నేడు ఘటనా స్థలాన్ని మరోసారి అధికారులు పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: