లాక్ డౌన్ పై మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 31 తో లాక్ డౌన్ అయిపోతుంది అనే విషయాన్ని చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనాను ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజులు చాలా కీలకమైనవి అంటూ ఆయన పేర్కొన్నారు. 

 

వర్షా కాలంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇతర వైరస్ లు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అయితే అక్కడ కేసుల తీవ్రత నేపధ్యంలో ఆయన లాక్ డౌన్ ని కొనసాగించడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: