టీటీడీ ని ఉపయోగించుకుని ప్రభుత్వం రాజకీయాలు చెయ్యాలని అనుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరర రెడ్డి స్పష్టం చేసారు. టీటీడీ బోర్డ్ నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎం సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. దేవుడి ఆస్తులను పెంచడానికే ప్రభుత్వం కృషి చేస్తుందని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసారు. టీటీడీ వేల౦పై ప్రభుత్వంపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు. 

 

ఆస్తులను వేలం వెయ్యాలి అనే నిర్ణయం టీటీడీది గాని ప్రభుత్వానిది కాదన్నారు ఆయన. దేవుడి ఆస్తులను పెంచడానికి తాము కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్ట౦ చేసారు. విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు చెవిరెడ్డి. కాగా టీటీడీ తమిళనాడు లోని 23 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను వేలం వెయ్యాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: