సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో ప్రతిభ బయటకు వస్తుంది. సోషల్ మీడియాలో అనేక వీడియో లు ఇప్పుడు వైరల్ గా మారడంతో కొత్త కొత్త టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వికలాంగ యువకుడి ఆట చూసి టీం ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయిపోయారు. 

 

తన సోషల్ మీడియా ఖాతాలో ఆ కుర్రాడి వీడియో ని ఆయన పోస్ట్ చేసారు. నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న వీడియో ని షేర్ చేస్తూ... మనిషిలో ఉన్న ఉన్న సామర్థ్యం, పట్టుదల మరియు ధైర్యాన్ని ఎవరూ దొంగిలించలేరన్నారు. ఇతని ఓర్పు మరియు శక్తికి నా వందనమని లక్ష్మణ్ ట్వీట్ చేసారు. అతన్ని చూసి అందరూ నేర్చుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: