కరోనా కట్టడిలో ఉత్తరాఖండ్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తుంది. అక్కడ చల్లటి వాతావరణం ఉన్నా సరే అక్కడి ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించి కరోనా వైరస్ ని కట్టడి చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ కరోనా కేసులు ఇప్పుడు వేగంగాపెరుగుతున్నాయి. ముందు ఒకటి రెండు కేసులు ప్రతీ రోజు వచ్చిన ఆ రాష్ట్రంలో ఇప్పుడు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం భయపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

నేడు అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరాఖండ్‌లో ఈ రోజు 53 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 298 కి చేరుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: