ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ పై వంద రోజుల పాలనపై ఇప్పుడు విపక్షాలు పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం పాలనకు వందకు వంద మార్కులు వచ్చాయని ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పడం హాస్యమని ఎద్దేవా చేసారు. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లున్నాయి వారి వ్యాఖ్యలని తన శైలిలో ఆయన ఎద్దేవా చేసారు. 

 

ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న నవరత్నాలకే దిక్కులేదన్నారు ఆయన. కొన్నింటికి నాణ్యత లోపించిందని ఆరోపించారు. మరికొన్ని ఇప్పటికీ అమలేకాలేదని... ఇంకొన్నేమో గులకరాళ్లుగా రూపాంతరం చెందాయని ఎద్దేవా చేసారు. రైతు భరోసా పథకం నిరాశగా మారిందని ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: