తిరుమల శ్రీవారి ఆస్తులను టీటీడీ వేలం వేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. శ్రీవారి ఆస్తులను ఏ విధంగా విక్రయిస్తారు అంటూ పలువురు ప్రభుత్వంపై బోర్డ్ పై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయ విమర్శలకు కూడా ఇది వేదికగా మరీనా సంగతి తెలిసిందే. 

 

దీనిపై తాము ఎక్కడికి అయినా వెళ్తామని ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులు ప్రకటనలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు జనసేన నేత, నిర్మాత నాగబాబు ట్విట్టర్ లో కీలక వ్యాఖ్య చేసారు. ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా,,ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి. అంటూ ఆయన తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: