మధ్యప్రదేశ్ లో చింద్వారాలో లాక్ డౌన్ కట్టడిలో భాగంగా ఇద్దరు పోలీసులు ఒక బాలుడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు కొట్టడం తో సదరు పోలీసుల మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు వీడియో లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన నేపధ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. 

 

ఇక వారి మీద శాఖా పరమైన విచారణ తో పాటుగా కేసు కూడా నమోదు చేసామని చింద్వారా పోలీసు సూపరింటెండెంట్ వివేక్ అగర్వాల్ మీడియాకు వివరించారు. ఈ వీడియో లు వైరల్ అయ్యాయి అని... నిన్న అలాగే 10 రోజుల క్రితం కూడా ఒక అధికారి ఇలాగే దాడి చేసారని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: