ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఖరారు అయింది. రేపు ఆయన విశాఖ వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. ఆయన ఎల్జీ పాలిమర్స్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే వెంకటాపురం గ్రామంలో మరణించిన వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.

 

రేపు ఉదయం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు 10 గంటలకు విశాఖ వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అమరావతి వెళ్లనున్నారు. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు అనుమతి ఇచ్చింది. ఆయన పర్యటనకు అనుమతి వస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో ఆయన మాట్లాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: