వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఒక కోల్డ్ స్టోరేజి లో జరిగిన 9 మంది హత్యల మిస్టరీ ని పోలీసులు చేధించారు. ఆటో డ్రైవర్ సహాయంతో సంజయ్ అనే వ్యక్తి 9 మందిని మత్తు టాబ్లెట్స్ ఇచ్చి హత్యలు చేసాడు. మక్సూద్ మరదలితో అతనికి అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెల్లడి అయింది. 

 

అతను మూడు మెడికల్ షాపుల నుంచి ఆటో డ్రైవర్ సహాయంతో టాబ్లెట్స్ ని కొనుగోలు చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. అందరిని చంపిన తర్వాతే వారిని బావిలో పడేసినట్టు విచారణలో వెల్లడి అయింది. ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.. రేపు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: