తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన ఆస్తుల అమ్మ‌క అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. నిర‌ర్థ‌క‌మైన ఆస్తుల‌నే వేలం వేస్తున్నామ‌ని టీటీడీ పాల‌క‌మండ‌లి చెబుతుండ‌గా.. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.. తాజాగా.. జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగబాబు కూడా ఘాటుగానే స్పందించారు.

 

ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు. *తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావాల‌ని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను* అంటూ ట్వీట్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: