జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భార‌త‌ భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో సోమ‌వారం ఉదయం రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, కుల్గాం పోలీసులు ఉమ్మడిగా కుల్గాం జిల్లా హంజిపురా ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

 

ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ప‌లు గ్రూపుల‌కు చెందిన ఉగ్ర‌వాదుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి విష‌యం తెలిసిందే. ఈ వ‌రుస ఘ‌ట‌నల నేప‌థ్యంలో స్థానికంగా ప్ర‌జ‌లు ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: