టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనేక సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. 25,000 డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని చెప్పి జగన్ మాట తప్పారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో ఒక్క పక్కా ఇంటి నిర్మాణం జరగలేదని... కొత్తగా ప్రభుత్వం రోడ్డు వేసిన పాపాన పోలేదని అన్నారు. ప్రభుత్వం నిధులు లేవని ఆస్తులు అమ్ముతోందని విమర్శలు చేశారు. 
 
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని... సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని అన్నారు. జగన్ సర్కార్ డబ్బు ఏమైపోతుందో తెలీకుండా దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మాఫియాల రాజ్యం నడుస్తోందని... జగన్ రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారేమోనని భయం వేస్తోందని విమర్శలు చేశారు. సీఎం తప్పుడు విధానాలకు బాధ్యత వహించేది అధికార గణం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: