ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉంది అన్న విషయం తెలిసిందే.కొన్ని రాష్ట్రాలలో ఏకంగా భారీ మొత్తంలో ఈ మహమ్మారి వైరస్ విజృంబిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ మహమ్మారి వైరస్ కంట్రోల్ లోనే ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మన పాలన మీ సూచన అనే పేరుతో మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కావడానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయటంలో గ్రామ వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు అంటూ ఆయన తెలిపారు. గ్రామ వాలెంటర్ల్లు అందరూ ఇంటింటికి తిరిగి ఇంట్లో సభ్యుల వివరాలను తెలుసుకోవడంతో పాటు మందులు అందించడం.. జాగ్రత్తలు సూచించడం లాంటివి చేశా…