రాష్ట్రంలో అన్నివ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. ఈరోజు చేప‌ట్టిన‌ *మ‌న పాల‌న‌-మీ సూచ‌న‌* కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. అన్నిరంగాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌లు ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నామ‌ని పేర్కొన్నారు. త‌ర్వ‌లోనే వైఎస్ఆర్‌ విలేజ్ క్లినిక్‌ల‌ను కూడా ప్రారంభిస్తామ‌ని, గ్రామాల్లోనే ఇక 24గంట‌లూ నుంచి ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య‌సేవ‌లు అందుతాయ‌ని అన్నారు.

 

ఇప్ప‌టికే ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య‌సేవ‌లను పేద‌ల‌కు అందిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధే ల‌క్ష్యంగా పాల‌న అందిస్తున్నామ‌ని, ఈ ఏడాది కాలంలో అవినీతి మ‌చ్చ‌లేని వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అందించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: