ఈ మద్య కాలంలో మనుషులు రాక్షసులుగా మారుతున్నారు.. నా అన్న అనుబంధాలను అపహాస్యం చేస్తున్నారు.. దాంపత్య జీవింతంలో కలతలు రావడం.. అవి హత్యలకు దారి తీస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.  తాజాగా తాగుడుకు బానిసైన ఓ తండ్రి తన కన్న కూతుర్లిద్దరిని బండరాయితో కొట్టి దారుణంగా చంపేసిన ఘటన యూపీలో జరిగింది.  అత్యంత అమానుషమైన ఈ సంఘటనతో అక్కడి ప్రజలు ఉగ్రరూపులయ్యారు.. ఆ తండ్రిని వెంటన చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి బెల్హెర్ పోలీసు సర్కిల్ పరిధిలోని బాబెతు గ్రామంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.  జైనాబ్ కొంత కాలంగా విపరీతంగా తాగుడుకి బానిసయ్యాడు.. ఈ నేపత్యంలో భార్యాభర్తల మద్య పెద్ద ఎత్తున గొడవలు కావడంతో భార్య విడాకులు తీసుకుంది.

 

కూతుర్లు అల్లుమిన్ నిషా(5), రూబీ(3) తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్య విడాకులు తీసుకున్న తర్వాత జైనాబ్ మరింత కృరంగా మారిపోయాడు.. ఆదివారం రాత్రి పీకలదాకా తాగి వచ్చి కూతుర్లు అల్లుమిన్ నిషా, రూబీ దారుణంగా బండరాయితో కొట్టి చంపాడు.  మద్యం మత్తులు అలా చేశానని పోలీసులకు వివరించాడు. పిల్లలు రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటుండగా జైనాబ్ చలనం లేకుండా ఉన్నాడని, అతడ్ని అరెస్టు చేశామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: