భారత సైన్యంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం. కరోనా కష్ట కాలంలో దేశానికి అండగా నిలవాల్సిన సైనికుడు ఇప్పుడు కరోనా బారిన పడటం అనేది కేంద్రం కూడా కలవర పడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బోర్డర్ లో పహారా కాసే సైనికుల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. 

 

తాజాగా సిఆర్పీఎఫ్ లో కొత్తగా 4 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా ఢిల్లీ లో ఉన్న సైనికులకే వచ్చాయి. ఇప్పుడు ఆ సంస్థలో 141 క్రియాశీల కేసులు ఉన్నాయి. 220 మంది కోలుకున్నారు. ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 363 మందికి ఇప్పటి వరకు కరోనా సోకిందని... సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: