ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో సంస్కరణలకు ఏపీ సర్కార్ శ్రీకార౦ చుట్టింది. వ్యవసాయ మార్కెటింగ్ రంగాలకు ఊతం ఇచ్చే విధంగా సలహా బోర్దులకు ఏపీ సర్కార్ ముందు అడుగు వేసింది. మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సలహా బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని భావిస్తుంది. 

 

రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖా మంత్రి సలహా బోర్డుకి చైర్మన్ గా ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రి చైర్మన్ గా ఉంటారు. మండల స్థాయిలో నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో క్షేత్ర స్థాయి వాస్తవాలను సర్కార్ కి వ్యవసాయ శాఖకు సూచిస్తారు. అదే విధముగా  ఏ వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనేది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: