జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు ఉగ్రవాదులకు భారత ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. ఆపరేష్ ఆల్ అవుట్ పేరుతో ఇప్పటికే భారీ ఆపరేషన్ ని అక్కడ కొనసాగిస్తూ పదుల సంఖ్యలో ఉగ్రవాదులను కాల్చి పారేస్తుంది. ఇక అది పక్కన పెడితే... ఉగ్రవాదులను క్షేత్ర స్థాయిలో దెబ్బ కొట్టే విధంగా అడుగులు వేస్తుంది భారత ఆర్మీ.
తాజాగా కాశ్మీర్ లో సంయుక్త ఆపరేషన్ లో ఉగ్రవాదులకు చుక్కలు చూపించారు. పోలీసులు, 44 ఆర్ఆర్ మరియు సిఆర్పిఎఫ్ సంయుక్త ఆపరేషన్లో, నజీర్ అహ్మద్ వాని అనే వ్యక్తి షాపులో భారీ పరిమాణంలో ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు.