తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణాలో నేడు కొత్తగా 66 కేసులు నమోదు అయ్యాయి. గత 24  గంటల్లో ఈ కేసులు నమోదు అయినట్టు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

ఇక తెలంగాణా తో గత 24 గంటల్లో ముగ్గురు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. 72 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణాలో కరోనా కేసులు 1920 కి చేరుకున్నాయి. తెలంగాణాలో 56 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 700 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: