ఇటీవల కాలంలో తండ్రుల అధికారాలను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతోన్న రాజకీయ నాయకుల వారసులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వారసుడిపై సైతం ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో నవభారత్ ఏరియాకు చెందిన భూక్య జ్యోతి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడిపై ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే కుమారుడు రాఘవ ప్రమేయంతో ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ.. ఆయన నుంచి తనకు ప్రాణహానీ ఉందని జ్యోతి మంత్రి సత్యవతి రాథోడ్కు ఫిర్యాదు చేసింది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. దీనిపై స్పందించిన మంత్రి సత్యవతి వెంటనే సీరియస్ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు అని ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని మంత్రికి.. ఎస్పీ తెలిపారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత మంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశించినట్టు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.