సోమవారం హైదరాబాద్ పట్టణంలో కలకలం రేగింది. పానీ పూరి తిని 40 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వారి వయసు ఐదు నుంచి పదేళ్ళు అని అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్యనగర్‌ లో ఉండే చిన్నారులు తోపుడు బండి వద్ద పానీ పూరి తిని ఇంటికి వెళ్ళారు. 

 

రాత్రి 9 గంటల సమయంలో ఒక్కొక్కరు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో తల్లి తండ్రులు ఆందోళన చెందారు. ఇలా 40 మంది ఆస్పత్రికి వెళ్ళారు. రాత్రి 11 గంటల వరకు తల్లి తండ్రులు చిన్నారులను ఆస్పత్రికి తీసుకు రావడంతో అసలు ఏం జరుగుతుందా అనేది అర్ధం కాలేదు. వారి ప్రాణాలకు ఏ ఇబ్బంది లేదని... అందరూ కోలుకుంటున్నారు అని ఆస్పత్రి వైద్యులు మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: