తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కరోనా కేసులు ఇప్పుడు కంగారు పెడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో ప్రతీ రోజు కూడా కరోనా కేసులు పదుల సంఖ్యలో నమోదు కావడం కంగారు పెడుతున్న అంశం. లాక్ డౌన్ ని హైదరాబాద్ లో కఠినం గానే అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా కట్టడికి కేంద్రం కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్.

 

ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ తో కలిసి పని చేయడానికి కేంద్రం సిద్దమవుతుంది. హైదరాబాద్ అనేది చాలా కీలక నగరం. కేసీఆర్ సర్కార్ తీసుకునే చర్యలపై కేంద్రం ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే కేసులు పెరగడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: