ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని ఏ స్థాయిలో టార్గెట్ చేసారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ లో విజయసాయి చంద్రబాబు విధానాలను టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రావడంపై ఆయన ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్య చేసారు.
సలహాలు, సూచనలు అంటూజూమ్ లో రోజూ ఊదరగొట్టావు కదా అంటూ ఎద్దేవా చేసారు. ఏడాది పాలన పై జగన్ గారు స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ? అంటూ చంద్రబాబుని ఉద్దేశించి ట్వీట్ చేసారు.
సలహాలు, సూచనలు అంటూ జూమ్ లో రోజూ ఊదరగొట్టావు కదా! ఏడాది పాలన పై జగన్ గారు స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?
— Vijayasai reddy v (@VSReddy_MP) May 26, 2020