దేశంలో కరోనా వైరస్ విస్తరించడం మొదలు పెట్టినప్పటి నుంచి చిన్నా పెద్దా.. పేద ధనిక అనే తేడా లేకండా అందరినీ భయపెడుతుంది.  ఇటీవల సినీ ఇండస్ట్రీలో కూడా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కరోనా వైరస్ కష్టాలు ఎక్కువే అయ్యాయి. ఆ మద్య చెన్నై ఎక్స్ ప్రెస్ ప్రొడ్యూసర్ అతని కూతుళ్లకు వచ్చింది.  మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటీవ్ వచ్చింది.    ఇటీవల బోనికపూర్ ఇంట్లో పని చేసే వారికి పాజిటివ్ అని తేలింది.  తాజాగా దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో పని చేసే ఇద్దరికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వారికి  కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. వారిని ఐసోలేషన్‌కు తరలించిగా.. కరణ్ ఫ్యామిలి హోం క్వారంటైన్ ఉన్నట్టుగా వెల్లడించారు.

 

వరుస ఘటనలతో బాలీవుడ్ ప్రముఖుల్లో కరోనా కలవరం మొదలైంది.  అయితే, కుటుంబ సభ్యులకు కానీ, మిగతా సిబ్బందికి కానీ ఎవరికీ వైరస్ సోకలేదని కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.  సిబ్బందికి కరోనా అని నిర్ధారణ అయిన వెంటనే అధికారులకు సమాచారం అందించామని, మునిసిపల్ సిబ్బంది వచ్చి తమ ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రసాయనాలు స్ప్రే చేశారని పేర్కొన్నాడు. అధికారుల ఆదేశాల ప్రకారం తామందరం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటామన్నాడు. అందరికి పరీక్షలు జరపగా.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: