మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు.. అన్నట్లు ఈ మద్య మనిషి పూర్తిగా మానవత్వాన్ని మంటగలుపుతున్న దిక్కుమాలిన పనులు చేస్తున్నారు.  తొమ్మది నెలలు తన కడపున మోసి కనీ పెంచిన తల్లి మృతదేహాన్ని బయట పడేసిన దుర్మార్గపు తనయుడిని సభ్యసమాజం ఛీదరించుకుంటున్నారు.  వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు.  మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు మృతి చెందిన తర్వాత కొడుకు ఉన్నా కూడా అనాధ శవం మాదిరిగా రోడ్డున పడినది. చనిపోయిన తర్వాత తల్లి మృతదేహాన్ని చూడటానికి విముఖత చూపించాడు కొడుకు నాగ మల్లేశ్వరరావు.  కేవలం తనకు ఆస్తి ఇవ్వలేదనన్న కోపంతోనే ఈ పనిచేశాడని అంటున్నారు.

 

ధనలక్ష్మి భర్త కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. ఆ సమయంలో ఆస్తి ఇస్తేనే తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తానంటూ చెప్పడంతో ధనలక్ష్మి కొడుకు నాగ మల్లేశ్వరరావుకు సగం ఆస్తిని రాసి ఇచ్చింది.  అయితే మిగిలిన ఆస్తి కూడా తన పేరున రాయాలని కొంత కాలం పట్టుబట్టాడు మల్లేశ్వరరావు. దాంతో కొడుకు బాధ భరించలేక బిడ్డ వద్దకు వెళ్లింది.  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బిడ్డకు ఆస్తి ఇచ్చిందనే కోపంతో మల్లేశ్వరరావు తల్లి మృత దేహంను ఇంట్లోకి రానిచ్చేది లేదంటూ గొడవకు దిగాడు. తన తల్లి అంత్యక్రియలు జరపని భీష్మించుకు కూర్చున్నాడు.  పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి వారే అంత్యక్రియలు చేయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: