ఒక పక్క లాక్ డౌన్ ఉన్నా కరోనాతో ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే తెలంగాణా సర్కార్ మాత్రం సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో ఏ విధంగా కూడా వెనక్కు తగ్గడం లేదు. ప్రజలకు  సహాయం చేస్తూనే సాగునీటి ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెట్టింది. తాజాగా  మరో ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయడానికి తెలంగాణా సిద్దమైంది. 

 

సిద్ధిపేట నియోజకవర్గంలోని మర్కుక్ గ్రామంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ నెల 29 ఉదయం 11;30 గంటలకు కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్ తో సిఎం కేసీఆర్ మాట్లాడారు. నిన్న సాయంత్రం ఆయన ఫోన్ చేసారు. 1500 మంది చూసే విధంగా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: