నెమళ్లను దేశంలో ఎంతో అపురూపంగా చూసుకుంటారు.. జాతీయ పక్షిగా నెలమలిని గౌరవిస్తుంటారు.  అలాంటి నెమళ్లను కొంత మంది కేటుగాళ్లు వేటాడటం చూస్తూనే ఉన్నాం. నెమలి మాంసం రేటు కూడా బాగా పలుకుతుంది.  ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో వేటగాళ్ల విషప్రయోగంతో ఎనిమిది నెమళ్లు మృతిచెందాయి. జిల్లాలోని నన్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వీటిపి బాగా గమనిస్తున్న దుండగులు అవి నీళ్లు త్రాగే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన అటవీశాఖ అధికారులు మృతి చెందిన నెమళ్లకు అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించారు.

 

నెమళ్ల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది రాగి వైర్ల దొంగల కోసం ప్రతి రోజూ గని సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుంటారు.  ఈ క్రమంలోనే నేమళ్లకు విషం ఇచ్చి చంపినట్లు సమాచారం. ఎఫ్‌డీవో వినయ్‌కుమార్‌, డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సంతోష్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. నెమలి ఈకలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో వాటిని చంపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొన్ని నెమళ్లకు ఈకలు పీకి ఉన్నట్లుగా గుర్తించారు. అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: