ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం పై ఇప్పుడు ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంది. సుధాకర్ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ హైకోర్ట్ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 

 

కేసుని సిబిఐకి అప్పగించడంపై ఏపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. అదే విధంగా తమ పోలీసులపై నమ్మక౦ లేదని ఏపీ సర్కార్ ని ఉద్దేశించి హైకోర్ట్ వ్యాఖ్యలు చేసింది. కాగా మాస్క్ లు లేవని సుధాకర్ ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో లో సిఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత ఆయన రోడ్డు మీద హడావుడి చేయడంవంటివి జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: