దేశ వ్యాప్తంగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రేంజ్ లో ఉన్నాయి ఎండలు. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజస్థాన్ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత చాలా దారుణంగా ఉంది. తెలంగాణాలో అయితే పది ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

 

దీనితో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇక రాజస్తాన్ లో అయితే దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీనితో అక్కడి ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎవరూ కూడా బయటకు రావిద్దని, అవసరం అయితేనే రావాలని పేర్కొంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలు నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: