హైదరాబాద్ లో వైద్య విద్యార్ధిని అనుమానాస్పద౦గా మృతి చెందింది. 14 వ అంతస్తు నుంచి సాహితీ అనే వైద్య విద్యార్ధిని దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె దూకి చేసుకుందా లేక పడిపోయిందా అనేది స్పష్టత లేదు. ఆమె ఉస్మానియా డెంటల్ కాలేజి లో వైద్య విద్యను చదువుతుంది. 

 

ఆమె మరణం గురించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆమె ఫోన్ కాల్ డేటా ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె ఎల్బీ నగర్ లోనే అలేఖ్య టవర్స్ లో  నివాసం ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: