సోషల్ మీడియాలో హైకోర్ట్ న్యాయమూర్తులను కించ పరుస్తూ పోస్ట్ లు పెట్టడం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సహా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కి హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వారి తో పాటుగా మరో 49 మందికి నోటీసులు ఇచ్చింది ఏపీ హైకోర్ట్. 

 

తీర్పులు వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కోర్ట్ ఏకపక్షంగా వ్యవహరిస్తు౦ది అని కొందరు అదే విధంగా కోర్ట్ లో కులాలు ఉన్నాయని మరి కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వీటిని ఒక లాయర్ హైకోర్ట్ కి ఆధారాలతో సహా సమర్పించడం తో చర్యలకు దిగింది ఏపీ హైకోర్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: