మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లో నడుస్తున్న కారు అగ్ని ప్రమాదానికి గురైంది. మూడు నెలల క్రితం కొన్న కారు ఇప్పుడు కాలిపోయింది. మల్కాజిగిరి విమలాదేవి నగర్ లో నివాసం ఉండే వెంకట్ రెడ్డి అనే మూడు నెలలు క్రితం కుషాయిగుడాలోని మెంబి మోటర్స్ లో క్విడ్ రినౌల్ట్  కొనుక్కున్నారు. 

 

ఈ రోజు మధ్యాహ్నం ఆనంద్ బాగ్ సమీపంలో కారులో ఆయన వెళ్తూ ఉండగా కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారులో ప్రయాణం చేస్తున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు పూర్తిగా కాలిపోయింది. ఎవరికి ఏ గాయాలు కాలేదు. కారు కొన్న మూడు నెలలకే ఇలా మంటలు వచ్చి కాలిపోవడంపై యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: