తెలంగాణాలో కరోనా పరిక్షల విషయంలో ఆ రాష్ట్ర హైకోర్ట్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో కరోనా టెస్టుల తీరుపై మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్ట్ కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. హైరిస్క్ అవకాశాలున్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదు? అని హైకోర్ట్ నిలదీసింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారు? అని ప్రశ్నించి౦ది.

 

మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలన్నీ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలని సూచించింది. కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో.. ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో...జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: