ఆంధ్రప్రదేశ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణా సిఎస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ కి రావడానికి సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగుమం చేసారు. హైదరాబాద్ లో చిక్కుకుని ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఇటీవల ఉద్యోగులు అందరూ కూడా విధులకు హాజరు కావాలని ఏపీ సిఎస్ నీలం  సహాని ఆదేశాలు కూడా ఇచ్చారు. 

 

అయితే హైదరాబాద్ లో ఉన్న కారణంతో వాళ్ళు రావడం లేదు. ఉద్యోగులు ఏపీ కి రావడానికి అనుమతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణా సిఎస్ ని కోరింది ఏపీ సర్కార్. దీనితో ఉద్యోగుల కోసం బస్సులను ఏర్పాటు చేస్తుంది ఏపీ సర్కార్. దాదాపు 400 మంది రేపు ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్దమవుతున్నారు. మియాపూర్ నుంచి ఈ బస్సులు నడుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: