ప్రకాశం జిల్లాలో దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ఏంటీ అంటే... ఒక ఇంటర్ విద్యార్ధిని ప్రేమ పేరుతో మోసపోయింది. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఈ ఘటన జరిగింది. అద్దంకి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని కొన్ని రోజుల క్రితం మోసం చేసి ఒక యువకుడు ఆమెను వదిలేసాడు. 

 

ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి పరిక్షలు చేయగా పురిటి నొప్పులుగా నిర్ధారించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. గత సెప్టెంబర్ నుంచి విద్యార్థిని కళాశాలకు రాలేదని ఆమెకు క్లాసులు చెప్పే టీచర్లు చెప్తున్నారు. తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: