తెలంగాణలో లాక్ డౌన్  పెంపు పై నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నేడు లాక్ డౌన్ పై తెలంగాణా సిఎం కేసీఆర్ నేడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉద్యోగుల జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 

 

లాక్ డౌన్ ని జూన్ 18 వరకు పెంచే యోచనలో తెలంగాణా సర్కార్ ఉందని వార్తలు వస్తున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న హైదరాబాద్ లో మాత్రం లాక్ డౌన్ సడలింపు లు ఇచ్చే అవకాశం లేదని  వార్తలు వస్తున్నాయి. అదే విధంగా రైతుల విషయాన్ని కూడా నేడు కేసీఆర్ సమీక్షించనున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: