కన్న తల్లి ఎవరికి భారం కాదు... మనకు జన్మనిచ్చిన తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. మనకు కష్టం వస్తే తల్లి ఏ విధంగా స్పందిస్తుందో తల్లికి కష్టం వచ్చినా సరే మనం అదే విధంగా స్పందించి ఆదుకోవాలి. కాని ఒక కొడుకు తల్లిని పోషించలేక కిరోసిన్ పోసి తగలబెట్టిన ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. 

 

నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామంలో తల్లిని లింగ స్వామి అనే కొడుకు కిరోసిన్ పోసి అంటించి చంపేసాడు. ఆమెను పోషించడం భారం అనుకున్న లింగ స్వామి చంపాలని నిర్ణయం తీసుకుని దారుణానికి ఒడిగట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: