నవమాసాలు కడపున మోసి కనీ పెంచిన తల్లి పై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె మరణానాకి కారణం అయ్యాడు ఓ దుర్మార్గపు తనయుడు.  ఈ ఘటన నర్సింగ్‌బట్ల లో చోటు చేసుకుంది. కేవలం ఆర్థిక కష్టాల వల్ల తన తల్లిని సాకలేకనే ఆమెను చంపినట్లు సమాచార.  ఈ సంఘటన చూసి సభ్యసమాజం ఛీదరించుకుంటున్నారు.  వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కానీ ఈ మద్య తనయులు చేస్తున్న దారుణమైన పనులు చూస్తూంటే అసలు నిజంగా పిల్లలను కంటే మనకు భవిష్యత్ లో తోడు ఉంటారా ఉండరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

వివరాల్లోకి వెళితే.. నర్సింగ్‌బట్లకు చెందిన శాంతమ్మ కొడుకు లింగస్వామి హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే లాక్డౌన్ వల్ల హైదరాబాద్‌లో పనులేవీ లేకుండా పోయాయి. దాంతో లింగస్వామి 10 రోజుల క్రితం సొంతూరికి చేరాడు.  ఆ నాటి నుంచి అతడికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురుయ్యాయి.. సహాయం చేసే వారు లేదు. దాంతో తల్లిని పోషించలేక.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పటించాడు. దాంతో ఆమె ఇంట్లోనే మరణించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: